సన్నగా అవ్వటానికి ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు

You are currently viewing సన్నగా అవ్వటానికి ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు

మనలో చాలా మంది బరువు తగ్గాలి అని రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు, బరువు తగ్గడం చూడడానికి అందంగా కనిపించటానికే  కాదు, ఆరోగ్యంగా జీవించటానికి కూడా ఎంతో అవసరం. అధిక బరువు వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఆరోగ్యంగా బరువు తగ్గటానికి ఆయుర్వేదం చెప్పే ఐదు చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, 

నిమ్మరసం అనేది సహజంగా శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించగలదు, ఇది క్రమం తప్పకుండా ఉపయోగిస్తే శరీరానికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఉదయాన్నే వెచ్చని నీటితో పెద్ద గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగు చేయటంలో సహాయపడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

ప్రతి రోజు ఒకే  సమయంలో తినండి, 

ఆయుర్వేదం ప్రకారం దినచర్యలో ఉదయం 8 గంటలకు అల్పాహారం చేయాలి, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేయాలి , మరియుసాయంత్రం  6 గంటలలోపే తేలికపాటి రాత్రి భోజనం చేయాలి. ఖచ్చితంగా ఈ సమయానికే భోజనం చేయాలి అని కాకపోయినా మన దినచర్యను బట్టి ప్రతీరోజూ ఒకే సమయంలో భోజనం చేసేలాగా షెడ్యుల్ చేసుకోవడం మంచిది. జీర్ణించుకునే శక్తి ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మంచి భోజనం చేయాలి రాత్రి జీర్ణక్రియ బలంగా ఉండదు కాబట్టి తేలిక  తీసుకోవాలి.ఇలా ఒక దినచర్యను పాటించటం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉండదు.

వారానికి కనీసం మూడు సార్లైనా వ్యాయామం చేయండి, 

శరీరంలోని కొవ్వును కరిగించాలంటే మీ బిజీ షెడ్యూల్‌లో వ్యాయామానికి ఖచ్చితంగా సమయం కేటాయించాలి. నడవటం , పరుగు, సైక్లింగ్, స్విమ్మింగ్ మరియు బరువు తగ్గడానికి యోగా వంటి ఎన్నో  సమర్థవంతమైన వ్యాయామాలు బరువు తగ్గటానికి సహాయం చేస్తాయి.యోగా అనేది మీరు ఇంట్లోనే చేయగలిగే ప్రక్రియ. బరువు తగ్గడానికి సూర్య నమస్కారాలు , విరాభద్రాసనం, ఉత్కటాసన మరియు సర్వంగాసనం సహాయపడతాయి.

కఫ దోషాన్ని శాంతపరిచే ఆహారాలను తినండి,

కఫ అధికంగా ఉన్న ఎక్కువగా తినడం వల్ల శరీరం నిదానంగా బద్దకంగా  అనిపించవచ్చు, దీని వల్లబరువు పెరుగుతారు మరియు జీవక్రియను కూడా నెమ్మదిస్తుంది. ఎప్పుడూ తాజాగా ఉన్న, ప్రాసెస్ చెయనీ ఆహారాలను తినటానికే ప్రాధాన్యత ఇవ్వటం మంచిది.సరైన ఆహరం తినటం బరువు తగ్గటానికి మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

బరువు తగ్గటానికి ఆయుర్వేద మూలికలను ఉపయోగించవచ్చు,

ఉదాహరణకు త్రిఫల, త్రిఫల అనేది భారతదేశంలో  అమలాకి , హరిటాకి , బిబిటాకి అనే   పండే మూడు సూపర్ పండ్లను కలిపి చేసే మూలికా తయారీ. త్రిఫల టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది అలాగే ఒక అధ్యయనంలో,బరువు తగ్గటానికి త్రిఫల ఉపయోగపడుతుందని తేలింది. ఈ విధంగా కలోంజి లాంటి ఇతర ఆయుర్వేద మూలికలు కూడా బరువు తగ్గటం లో సహాయం చేస్తాయి.

చివరగా

బరువు తగ్గటానికి ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో చిట్కాలను ఆయుర్వేదం చెబుతుంది, ముఖ్యంగా సరైన మితాహారం తీసుకొని సమయానికి నిద్రపోతే సరైన బరువులో ఉండటం సాధ్యపడుతుంది.మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి  ఈ క్రింది  లింక్ పై క్లిక్ చేయండి. 

Also Read: మనం తినే డ్రై ఫ్రూట్స్ లో కల్తీ ఉంటే గుర్తు పట్టడం ఎలా?

Disclaimer:

This content is for informational purposes only. Read full disclaimer [here]