రసాయన ఆయుర్వేదం వలన ఎటువంటి దుష్ప్రయోజనాలు జరగకపోగా ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా నియంత్రిస్తుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు మొదట శరీరంలోని మెటబాలిజాన్ని దెబ్బతీసి కణాల వ్యవహారశైలిని ప్రభావితం చేస్తుంటాయి. ఇతర వైద్య విధానాల పోకడ ఏమిటి అని గమనిస్తే, ఉన్న నాలుకకు మందు వేస్తే కొండనాలుక ఎఫెక్ట్ అయినట్టు అని ఎక్కువ మంది నానుడి. ఇలాంటి ద్వంద వైఖరి అనుమానాలు వస్తుంటాయి. కానీ రసాయన ఆయుర్వేదం వ్యాధి మూలాలపైన సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది కొత్త క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకునేలా పనిచేస్తుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెందిన క్యాన్సర్ కణాల మీద కూడా ప్రభావంతంగా పనిచేయడం రసాయన ఆయుర్వేద లక్ష్యం.
ఈ ట్రీట్మెంట్లో ప్రధానంగా శరీర ఇమ్యునిటీ స్థాయిని పెంచే విధంగా మొదట రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరంలో ఉన్న సహజ కణాలకు కొత్త శక్తినిస్తూ దెబ్బతిన్న కణాలకు మాత్రం మరమ్మతులు చేస్తుంది. కేవలం దెబ్బతిన్న కణాలు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన కణాలలో కూడా రసాయన ఔషధాలు నూతనోత్తేజాన్ని నింపుతుంటాయి. ఆకలి మందగించిన క్యాన్సర్ బాధితుల్లో మొదట ఆకలి పుట్టేలా చేసి, సహజంగా ఉండే నీరసాన్ని కూడా తొలగించి బలాన్నిస్తుంటుంది. దీంతో పాటు శరీరంలో రోగనిరోధకశక్తి కూడా బలోపేతమవుతుంది కాబట్టి బాధితులు మొదట కోల్పోయిన శక్తిని తిరిగి సాధించి మరింత వేగంగా కోలుకునే అవకాశముంటుంది.
Also Read: క్యాన్సర్లలో సర్కోమాను రసాయన ఆయుర్వేదం తగ్గించగలదా?
Disclaimer:
This content is for informational purposes only. Read full disclaimer [here]





















